విశాఖపట్నం
రాష్ట్రంలో న్యాయం చేయవలసిన పోలీసులకే న్యాయం జరగడంలేదని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు.పోలీసులు దాచుకున్న 800 కోట్ల రూపాయల ప్రావిడెంట్ ఫండ్ ను సీఎం జగన్ వాడేశారని ఆయన ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి అధికా రంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.సీఎం జగన్ స్వార్థం కోసం అధికారులతోటే తప్పుడు పను లు చేయిస్తున్నారని అయ్యన్న ఆరోపిం చారు.పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమం ది అధికారుల వల్ల డిపార్ట్మెంట్ అంత టికీ చెడ్డ పేరు వచ్చిందన్నారు.
ప్రజా స్వామ్యంలో తప్పులు చేస్తే విమర్శించ డం తమ ధర్మమని, విమర్శించినం దుకు తప్పుడు కేసులు బనాయించి ఇంటిపై దాడులు చేసి ఆస్తులు ధ్వం సం చేయడం ఎంతవరకు సబబని అయ్యన్న ప్రశ్నించారు.అర్ధరాత్రి సమ యంలో వచ్చి అరెస్టులు చేయడంతో పాటు తనపై 15 తప్పుడు కేసులు బనాయించారని గుర్తు చేశారు. రాష్ట్ర జనాభాకి సుమారు 75 వేల మంది పోలీసులు అవసరం ఉండగా కేవలం 60 వేల మంది మాత్రమే సేవలందిస్తు న్నారని తెలిపారు.రాష్ట్రంలో లా అం డర్ ఆర్డర్ కాపాడటానికి వారు సరిపో తారా? అని అయ్యన్న ప్రశ్నించారు.