రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఇటీవల కాలంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అడ్డంగా మీడియాకు బుక్ అయిన సంత బొమ్మాలి మండల పార్టీ అధ్యక్షుడు కోత సతీష్ పై నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ వాణి శ్రీనివాస్ మరోసారి ఫైర్ అయ్యారు. గ్రామ సచివాలయాల కన్వీనర్లలో తో సమావేశం నిర్వహిస్తున్న సందర్భంగా కోత సతీష్ మాట్లాడుతూ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్లు టిడిపి వారు రాద్ధాంతం చేశారని కప్పిపుచ్చుకున్న ప్రయత్నం చేశారు. దీనితో దువ్వాడ వాణి సీరియస్ అవుతూ ఇక్కడ ఏ సందర్భంగా గురించి సమావేశం జరుగుతుందో దానిగురిచే చర్చించాలని వ్యాపారాల కోసం ఇతర అంశాల కోసం చర్చించే సందర్భం ఇదా అంటూ ఫైర్ అయ్యారు.
Also Read: పోలీసులకు హారతి పట్టిన వైఎస్ షర్మిల
పార్టీ నాయకులకే గౌరవం లేనప్పుడు ప్రతిపక్షాలు ఎందుకు రాద్ధాంతం చేస్తాయో తెలుసు కోవాలని అన్నారు. మూలపేట కోర్టు సంబంధించి కాంట్రాక్టు పనులన్నీ కొత్త సతీష్ నేపథ్యంలోనే జరుగుతున్నాయని ఇది పార్టీకి చెడ్డ పేరు తెస్తుందని కోత సతీష్ పై దువ్వాడ వాణి తీవ్రంగా విరుచుకుపడ్డారు మూలపేట పోర్టు నిర్వాసితుల సమక్షంలో సతీష్ కు దువ్వాడ వాణి క్లాస్ పీకడం పార్టీ వర్గాల్లో కలవరం మొదలైంది అయితే సంతబొమ్మాలి మండల పార్టీ అధ్యక్షుడు కోత సతీష్ కు గతంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో చేతివాటం జరిగినట్లుగా మరియు ఇప్పుడు వాణి క్లాసు పీకడంతో ఆయనకే అవమానాలు కొత్త ఏమీ కాదు అవమానాల కన్నా కాసులే సంపాదనే ఆయనకి ప్రధానమనే పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చలు వినిపిస్తున్నాయి.