నాగర్కర్నూల్ జిల్లా: బిజినపల్లి మండలం పాలెంలో ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు ఆందోళనకు దిగింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఎంగేజ్మెంట్ చేసుకొని తర్వాత ముఖం చాటేయడంతో ప్రియురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇదీ జరిగింది: కొల్లాపూర్ మండలం జటప్రోలు గ్రామానికి చెందిన ఓ మహిళ జూనియర్ లెక్చరర్గా పనిచేస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు బురాన్. అయితే ఇద్దరు 2018 నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో వాళ్లకు చెప్పి ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే బురాన్ ఎంగేజ్మెంట్ అయిన సమయంలో తన చెల్లి పెళ్లి తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఒప్పించాడు. ఇద్దరు 5సంవత్సరాల పాటు కలిసి ఉన్నారు. ఎంగేజ్మంట్ అయిన 3ఏళ్ల తర్వాత చెల్లి పెళ్లి చేశాడు.
తర్వాత కొంతకాలానికి రిజ్వానతో మాట్లాడకుండా ముఖం చాటు వేసే ప్రయత్నం చేశాడు. ఆమెఎంత ప్రయత్నం చేసిన మాయమాటలు చెప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. పెళ్లి చేసుకుందామని నిలదీయగా సముదాయించి కొంతకాలం ముఖం చాటు చేటేశాడు. చివరికి ఏం చేయాలో తెలియక ప్రియుడి కోసం అకని ఇంటి ఎదుట కూర్చోని నిరసన వ్యక్తం చేసింది. తనను మోసగించాడని విలువలతో బతికిన తన కుటుంబంలో బురాన్ చిచ్చురేపాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనతో ఎంగేజ్మెంట్ కూడా పెద్దల సమక్షంలోనే జరిగిందని కానీ పెళ్లి విషయం వచ్చే వరకు పెద్దలు కూడా స్పందించడం లేదన్నారు.