తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో నూతన జిల్లాలతో పాటు నూతన మండలాలు ఇదివరకే ఏర్పడ్డాయి. అయితే ఆదిలాబాద్ జిల్లాలోను కొత్తగా మండలాలు ఏర్పడినా ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా అదిలాబాద్ జిల్లాలో సోనాల, సాత్నాల నూతన మండలాలు ఏర్పాటు చేయాలని గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ కల ఎట్టకేలకు నెరవేరింది. ఆదిలాబాద్ జిల్లాల్లోనీ ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా కొన్ని నూతన మండలాలు ఏర్పాటు చేయాలని గత కొద్ది రోజులుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న తరుణంలో.. శుక్రవారం కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సిఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పార్లమెంట్ సభ్యులు మాజీ ఎంపీ గోడం నగేష్, ఎమ్మేల్యే జోగు రామన్నతో కలిసి సిఎం కేసీఆర్ దృష్టికి నూతన మండలాల విషయాన్ని తీసుకెల్లారు.
జూలై, 1న నిర్విహించే గ్రూప్ – 4 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం..
దీంతో వెంటనే స్పందిచిన సీఎం కేసీఆర్ తన ఫోన్ లో అధికారులతో మాట్లాడి నూతన మండలాలు ఏర్పాటు చేయుటకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో వారు సీఎం కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇందులో నూతనంగా సోనాల, సాత్నాల, బోరజ్ మూడు మండలాల పేర్లు ఖరారైనట్లు వారు తెలిపారు. ప్రజల వెసులుబాటు, సకల సౌకర్యాల కొసం నూతన మండలాల ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడంతో ఆ మండలాల్లోనీ ప్రజలు తమ ప్రజా ప్రతినిదులైన మాజీ ఎంపీ గోడం నగేష్, ఎమ్మేల్యే జోగు రామన్న లకు కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, తాంసి, భీంపూర్ జడ్పీటీసీలు టి.రాజు, కుమ్రం సుధాకర్ తదతరులు ఉన్నారు.