ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా సింగరేణి జిఎం ఆఫీసు పరిసరాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని శుక్ర వారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా జీ ఎం ఆర్జి3 ఎన్. సుధాకరరావు జిఎం ఏపిఏ కె. వెంకటేశ్వర్లు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ‘అభివృద్ధి పేరుతో పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. దీనికి ప్రపంచం లోని 800 కోట్ల మందిమి బాధ్యులమే. గ్రామాలలో సైతం అందమైన భవనాలు కడుతున్నారు. కాని ఇంటి పరిసరాలలో చెట్లను పెంచడం లేదు. అందువలననే ఆరుద్ర కార్తెలో కురవాలిసిన వర్షాలు కురవలేదు. తొలి ఏకాదశికి చేపట్టాలసిన పొలంపనులు మొదలవలేదు. దీనికి పరిష్కారం ప్రతి ఒక్కరు మొక్కను నాటి సంరక్షించడం మాత్రమే.
వేరే పనులద్వారా పర్యావరణాన్ని రక్షించలేము. కాబట్టే మనప్రభుత్వం, మన కంపెనీ భారీ ఎక్కువ మొక్కలను నాటి సంరక్షిస్తుంది. ఇది ఆదర్శంగా తీసుకుని మన ఇంటి పరిసరాలలో విరివిగా మొక్కలు నాటాలి. ‘ అని అన్నారు. అధికారులు, కార్మికనాయకులు, ఉద్యోగులతో కలసి మొక్కలునాటారు. టి బి జి కే ఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ గౌతం శంకరయ్య, ఏరియా ఇంజినీర్లు పి. ఎలీషా, సీతా రామం, ఎస్ వో టు జీ ఎం ఏ పి ఏ డి. బైద్యా, ఫైనాన్స్ ఏ జీ ఎం పి. శ్రీనివాసులు, ఐ ఈ డి డీ జీ ఎం కే. చంద్ర శేఖర్, సీనియర్ ఎస్టేట్స్ అధికారి కే. ఐలయ్య, డీ వై పీ ఎం లు ఎం. రవీందర్ రెడ్డి, కే.మారుతి, ఐ టీ డి ప్యుటి మేనేజర్ ఆర్. రాజేశ్వరి, విటిసి అధికారి అనం తుల శ్రీనివాస్ లతో పాటు ఇతర అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.