హుజూరాబాద్ లో వందలకొట్లు ఖర్చు పెట్టినా గెలవలేదు అని, ప్రజలకు ఆయన పద్దతి రుచి చూపించేందుకు ఒక సైకోకు ఎమ్మెల్పీ ఇచ్చి నన్ను హింస పెట్టే పని చేస్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. బుధవారం నాడు అయన ఖాజీపేట రైల్వే స్టేషన్ లో మీడియాతో మాట్లాడారు. ప్రజలందరినీ, అణగారిన వర్గాల వారిని బెదిరించడం చేస్తున్నారు. ప్రెస్ వారిని కూడా భయపెదుతున్నారు. అసలే పిచ్చోడు వాడికి ప్రగతి భవన్ అండగా ఉంది అని నేను సైలెంట్ గా ఉన్నా.. సీఎం ఆయనకు ఒక స్పెషల్ టాస్క్ ఇచ్చారని తెలిసిందని అన్నారు.పంగిడిపల్లిలో మా మీద దాడి చేశారు.
ప్లాన్డ్ గా దాడి చేశారు. పోలీసులు మాత్రం మా వాళ్ళను పట్టుకుపోయు కొట్టి కేసులు పెట్టారు. మొన్న జీఎస్ఆర్ టీవీ కెమెరామన్ వీడియో తీశారని అతని కొట్టే సందర్భంలో..అతని కులం ముదిరాజ్ అని చెప్పగానే వీరంగం వేశారు. ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు. ఈటల రాజేందర్ ను 20 కోట్లు ఇచ్చి చంపుతామని చెప్పినట్టుగా ఆడియో రికార్డ్ అయ్యింది. వాటిపై కంప్లైంట్ ఇచ్చాము. ఇవన్నీ ప్రగతి భవన్ కేంద్రంగా కెసిఆర్ చేస్తున్న పనులని విమర్శించారు. ఈ పనులు ఆపకపోతే హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో, జమ్మికుంట గాంధీ చౌరస్తాలో చెప్పులు మెడలో వేసి తిప్పుతాం అని నిన్నే మా వాళ్ళు చెప్పారు.నయీం కే భయపడలేదు.
సాంబశివుడు ను చంపినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నేను మాట్లాడుతూ నయీం ను కుక్క చావు చస్తావు అని చెప్పా. అప్పుడు అనేక బెదిరింపులకు దిగారు. అయినా భయపడలేదు. ఇప్పుడు సీఎం చిల్లర గాల్లతో దాడి చేయిస్తా అని అంటే భయపడతానా అని అన్నారు. హుజూరాబాద్ లో జరిగే అరాచకాలపై అనేక సార్లు సీపీ లకు చెప్పినా. నీ కరీంనగర్ సిపి స్పందించలేదు. నీచుల శాడిస్ట్ లను ప్రేరేపిస్తే ఖబడ్దార్. నీ వెంబడి పడతా. కేటీఆర్ నా భద్రత గురించి మాట్లాడినట్లు తెలిసింది. కెసిఆర్ హెచ్చరిస్తున్నా నీ తాత జాగీరు కాదు. రక్షణ కల్పించాల్సిన భాధ్యత ప్రభుత్వానిదే.. కేంద్ర భద్రత ఇస్తుంది అని కూడా టీవీ లోనే చూసా.. ఐబి నివేదిక ఇచ్చివుంటుంది. పోలీసుల రక్షణ కాదు.. ప్రజలే రక్షించుకుంటారు. ఎమ్మెల్సీ నీ వెంటనే బర్తరఫ్ చెయ్యాలి అని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.