సోనియా గాంధీ వల్లనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది……కమాన్ పూర్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…..
కమాన్ పూర్
కమాన్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు కమాన్ పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు.
అనంతరం కాంగ్రెస్ నాయకులు జాతీయ గీతాన్నిఆలపించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ 70 ఏళ్ల తెలంగాణ కలను సోనియాగాంధీ తో సహకారం అయిందని నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల కల సాకారం చేసిన ఘనత సోనియా గాంధీదన్నారు.
తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడటానికి అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టీ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు పునాదులు వేసి ఈ ప్రాంత ప్రజలను అగ్ర స్థానంలో నిలిపిన మహా నేత మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అని తెలియజేశారు.
బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
ఈ కార్యక్రమంలో రంగు సత్యనారాయణ గౌడ్ ,సయ్యద్ ఇక్బాల్,కొంతo శ్రీనివాస్,సాగి శ్రీధర్ రావు, శ్రీ మూర్తి సాయి,పిడుగు శంకర్ , అడ్వల చంద్రయ్య, ముస్తక్,పిడుగు నర్సయ్య, చొప్పరి శేకర్,పిట్టల శoకర్,పెండ్యాల రాజు ,కుక్క రవి, యూసుఫ్ లల్లు, శంకర్,రవి ,కనుకయ్యా, వడ్లకొండ మల్లయ్య గౌడ్,కాడిపెల్లి సుమన్, తుండ్ల కనుకయ్యా,అజయ్ ,శ్రీను మామిడి రాజు, తదితరులు ఉన్నారు