Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ధాన్యం కొనుగోళ్ళ నిలిపివేతపై రోడ్డెక్కిన మంథని రైతన్నలు, ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేపట్టాలని రాస్తారోకో

0

మంథని

మంథని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంతో మంథని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ముందు గల ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. మంథని- పెద్దపెల్లి రహదారిపై రైతన్నలు రాస్తారోకో నిర్వహించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దాన్యం మార్కెట్ యార్డుకు తెచ్చి నెల రోజులు గడుస్తున్న కాంట వేయడం లేదని మండిపడ్డారు. కాంట వేసిన ధాన్యం క్వింటాలకు 10 కిలోల చొప్పున తరుగుతీస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం నాణ్యత లేదని నల్లబడిందని రకరకాల కారణాలు చెప్పి రైతులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఇప్పటికే రెండుసార్లు అకాల వర్షాల వల్ల దెబ్బతిని నష్టపోయామని చేతికి వచ్చిన పంటను అధికారులు కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు.

మన ఊరు మనబడి  పనుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు , జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి వెంటనే కాంటా కొనసాగించాలని తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. విషయం తెలిసిన మంథని తహసిల్దార్ బండి ప్రకాష్, ఆర్ఐ రాజిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని రైతులకు సర్దిచెప్పి ధాన్యం కొనుగోలు జరుపుతామని, కాంటా సజావుగా సాగుతుందని తరుగు లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. ఇలాంటి అవంచనీయ సంఘటన జరగకుండా మంథని ఎస్సై వెంకటేశ్వర్లు చర్యలు చేపట్టారు. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రాస్తారోకో లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంథని పరిసర గ్రామాల రైతులు ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie