అవినాష్ రెడ్డి ఎపిసోడ్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్
విశాఖపట్నం
ఎంపీ అవినాష్ రెడ్డి ఇష్యూపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. అవినాష్ రెడ్డి ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉందన్నారు. అరెస్ట్ చేయడానికి మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. తల్లికి ఆరోగ్యం బాగోలేకపోతే హైదరాబాద్కు ఎందుకు తీసుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఆరు సార్లు సీబీఐ విచారణకు వెళ్లానని చెప్పుకుంటున్నారని.. ఎన్ని సార్లు హాజరు కాలేదో కూడా సజ్జల చెప్పాలని డిమాండ్ చేశారు.ఈనెల 27న సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లబోయేది కచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని అవినాష్ రెడ్డి కోసమేనన్నారు.2 వేల నోట్లరద్దు ను స్వాగతిస్తున్నామన్నారు. ఆ నోట్లు ఎవరి దగ్గర ఉన్నాయో వారికే ఇబ్బందని అన్నారు.