- తండ్రి, కొడుకుల పరిస్థితి విషమం
- పలువురికి గాయాలు
బైక్ ను ఢీకొట్టి ఆర్టీసీ బస్సు గుంతలోకి దూసుకెళ్లిన ఘటన కోరుట్ల మండలంలోని వెంకటాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. నిజామాబాద్-1 డిపోకు చెందిన టీ ఎస్ 16 జెడ్ 0230 నంబర్ గల ఆర్టీసీ బస్సు వరంగల్ వైపు వెళ్తుంది. అదే సమయంలో టీ ఎస్ 21 ఏ 0126 నంబర్ గల ద్విచక్ర వాహనంపై వెంకటాపూర్ గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు సోమిశెట్టి వెంకటి, సోమిశెట్టి వెంకటేష్ జగిత్యాల నుండి వెంకటాపూర్ వెళ్తున్నారు. ఈ క్రమంలో బైక్ పై వెళుతున్న వారు వెంకటాపూర్ క్రాస్ రోడ్ వద్ద తమ ఊళ్లోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న క్రమంలో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి బైక్ ను తప్పించే ప్రయత్నం లో ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది.
స్పందించిన స్థానికులు బస్సు అత్యవసర ద్వారం తెరిచి ప్రయాణీకులను బయటకు దించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వెంకటి, వెంకటేష్ లకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో వారి పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన చికిత్స కోసం కరీనంగర్ కు తరలించారు. బస్సులోని ప్రయాణికులలో పలువురికి గాయాలవడంతో వారిని జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.