Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం

0
  • కొడిమి జర్నలిస్టు కాలనీలో అభివృద్ధి పనులు పరిశీలించిన మచ్చా రామలింగారెడ్డి
  • రెండు కోట్లతో అభివృద్ధి శరవేగంగా అభివృద్ధి పనులు
  • సీ.ఎం వైఎస్ జగన్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కలెక్టర్ ఎం.గౌతమికి ధన్యవాదాలు
  • రాష్ట్రానికి కొడిమి జర్నలిస్ట్ కాలనీ రోల్ మోడల్ చేస్తాం
  • మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్

రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా వారి కుటుంబాల్లో వెలుగు నింపేందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పనిచేస్తుందని జర్నలిస్టులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా రూరల్ మండలంలోని కొడిమి గ్రామం నందుగల జర్నలిస్టు కాలనీలో డ్రైనేజీ, సిమెంట్ రోడ్డు, అప్రోచ్ రోడ్డు పనులకు రెండు కోట్ల రూపాయల నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం ఉదయం మచ్చా రామలింగారెడ్డి పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి విజయరాజు, వెంకటేశులు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, జానీ, నాయక్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ కొడిమీ జర్నలిస్టు కాలనీలో అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృషిచేసిన స్థానిక శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి కలెక్టర్ గౌతమికి జర్నలిస్టు కుటుంబాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చొరవ, కృషి వలన నిధులు విడుదలయ్యాయని అన్నారు. రాష్ట్రంలోని మొట్టమొదటి జర్నలిస్టు కాలనీ కొడిమి జర్నలిస్ట్ కాలనీ రాబోవు రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసి రాష్ట్రానికి రోల్ మోడల్ గా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మచ్చా రామలింగారెడ్డి అన్నారు.

జర్నలిస్టులు అందరూ ఐకమత్యంతో ముందుకెళ్లాలని కలసికట్టుగా ఉండటం ద్వారానే జర్నలిస్టులకు సంక్షేమ ఫలాలు అందుతాయని అందుకోసం అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని రాబోవు రోజుల్లో అనంతపురం జిల్లా రోల్ మోడల్ గా ఉండేందుకు జర్నలిస్టులు అందర్నీ ఒక వేదిక మీదికి తీసుకొస్తామని మచ్చా రామలింగారెడ్డి అన్నారు. అనంతపురం రూరల్ మండలం ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టు కాలనీ అభివృద్ధికి తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే ఈ కాలనీకు అన్ని విధాల అభివృద్ధి చేయాలని తమకు సూచించారని అందుకు తాము ఎప్పుడూ సహకారం అందిస్తామని కృష్ణారెడ్డి జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, రామంజి, అక్కులప్ప, మల్లిఖార్జున, రమణ, బాలకృష్ణ, కొండ రెడ్డి, రఘు, కిరణ్, శ్రీరాములు, వేణు, చక్రి, ప్రకాష్, రంగనాథ్, ఇతర ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie