అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో ఉన్న ఎస్.ఆర్.ఐ.టి ఇంజినీరింగ్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత రాత్రి కళాశాల హాస్టల్లో విద్యార్థులు ఎగ్ రైస్, కర్డ్ రైస్ తిన్నారు. ఆ తరువాత కాసేపటికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆందోళన చెందిన హాస్టల్ నిర్వాహాకులు సుమారు 30మంది విద్యార్థులను అమరావతి ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.