Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

సంచార్ సాధితో .. మొబైల్ నేరాలకు చెక్..

0

ఆధార్ కార్డులు వచ్చినప్పటి నుండి ఏ పనికైనా ఆధార్ తప్పనిసరిగా మారిపోయింది. ఈ ఒక్క కార్డు లేకపోతే ఏ పనీ జరగడం లేదు. ఇందులో కొంత వెసులుబాటు ఉన్నా.. సమస్యలు కూడా అన్నే ఉన్నాయి. మన ఆధార్ జిరాక్స్ వేరే వారి చేతికి వెళ్తే మన సమాచారం అంతా వారి చేతుల్లోకి వెళ్లినట్లే. దాంతో సిమ్ కార్డులు తీసుకుని వాటితో ఆన్ లైన్ నేరాలు చేస్తున్న ఘటనలు రోజూ వార్తల్లో వస్తూనే ఉన్నాయి. ఏదైనా నేరం జరిగి పోలీసులు మన ఇంటికి వచ్చే వరకు కూడా మన పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోలేని పరిస్థితి.

 

ఈ సమస్యను గుర్తించిన కేంద్ర సర్కారు తాజాగా సంచార్ సాథీ అనే పోర్టల్ ను ప్రారంభించింది. మొబైల్ ఫోన్ల ద్వారా జరిగే నేరాలను అరికట్టడమే ముఖ్య ఉద్దేశంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ సంచార్ సాథీ పోర్టల్ ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.తాజాగా ప్రారంభమైన సంచార్ సాథీ పోర్టల్ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నట్లు కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అలాగే మొబైల్ ఫోన్ల ద్వారా జరిగే నేరాలను అరికట్టడానికి సంచార్ సాథీ పోర్టల్ ను తీసుకువచ్చినట్లు తెలిపారు.

నాలుగున్నర కోట్లు..

ఈ పోర్టల్ ద్వారా ఒకరి పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ మధ్యే తీసుకువచ్చిన సీఈఐఆర్ వెబ్ సైట్ కూడా సంచార్ సాథీ పోర్టల్ లో మొదటి అడుగుగా అభివర్ణించారు కేంద్రమంత్రి. ఫోన్ పోయినప్పుడు ఆ ఫోన్ లోని సమాచారాన్ని ఎవరూ చూడకుండా దానిని సంచార్ సాథీ పోర్టల్ ద్వారా బ్లాక్ చేయవచ్చని వెల్లడించారు. డిజిటల్ ఐడెంటిటీ కోల్పోకుండా చూడటం ఒక అంశంగా పేర్కొన్నారు. నో యువర్ మొబైల్ అనే రెండో ఫీచర్ గురించి వివరించారు.ఆధార్ కార్డు ఉంటే సిమ్ తీసుకోవడం చాలా సులభం.

 

అయితే ఒకరి పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో.. వాటిని ఎక్కడెక్కడ తీసుకున్నారో సంచార్ సాథీ పోర్టల్ ద్వారా తెలుసుకునే వీలు కల్పించారు. వ్యక్తులకు తెలియకుండా వారి పేరుపై ఉన్న సిమ్ లను ఈ పోర్టల్ ద్వారా తొలగించే అవకాశం ఉంది. ఆధార్ కార్డు నంబరు సాయంతో నకిలీల గురించి తెలుసుకోవచ్చు. దొంగిలించిన ఫోన్ లొకేషన్ కనుక్కోవడంతో పాటు లీగల్ విధానంలో ఒక ఫోన్ ను పని చేయకుండా చేయవచ్చు. ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఫోన్లకు డిటోగా ఉండే క్లోన్ ఫోన్లు మార్కెట్లో తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటాయి. వీటిని ఒరిజినల్ ఫోన్ గా భ్రమింపజేసే అమ్మే వారు కూడా ఉంటారు.

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో, లారీ ఢీ.. ఐదు గురు మృతి.

అలాంటి పరిస్థితిలో అది నిజమైనదో కాదో తెలుసుకోవడానికి సంచార్ సాథీ పోర్టల్ ఉపయోగపడుతుంది. ఫోన్ ఐఎంఈఐ నంబరు సాయంతో ఆ ఫోను నిజమైనదా, నకిలీదా సులభంగా తెలుసుకోవచ్చు. ’87 కోట్ల మొబైల్ ఫోన్లపై కనెక్షన్లను పరిశీలిస్తే.. అందులో 42 లక్షల కనెక్షన్లు నకిలీవిగా తేలింది. అందులో 36 లక్షల కనెక్షన్లను రద్దు చేశాం. మూడు విధాలైన సంస్కరణలతో సంచారా సాథీ పోర్టల్ తీసుకొచ్చాం. భారత టెలికాం సెక్టార్ ను గ్లోబల్ లీడర్ గా చేయడమే మా లక్ష్యం’ అని కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పుకొచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie