మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి
పార్టీ మార్పు వంటి వస్తున్న పుకార్లపై అగ్రహాం వ్యక్తం చేసిన దామోదర్ రెడ్డి
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీల్లో తానే ఉంటానని మంచి మెజార్టీతో గెలుస్తానని మాజీ మంత్రి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు సూర్యపేట జిల్లా కేంద్రంలోని రెడ్ హౌస్ లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు
పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న తప్పుడు ప్రచారం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ
పనికట్టుకుని బీఆర్ఎస్ తో పాటు కొంతమంది సొంత పార్టీ నాయకులే దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
నాలుగు తరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాలాంటి వ్యక్తి పై దుష్ప్రచారం జరగడం దురదృష్టకరం ఆన్నారు.
దయచేసి ప్రజలు , కార్యకర్తలు ఎవరు దుష్ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు
బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు నన్ను సంప్రదించలేదని స్పష్టం చేశారు.
నన్ను పార్టీ మారమని అడిగే దమ్ము ధైర్యం ఎవరికి లేదనీ వెల్లడించారు.
నా పుట్టుక కాంగ్రెస్ ఆని చివరి శ్వాస వరకు కాంగ్రెస్ లోనే ఉంటానని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ టికెట్ పై సూర్యాపేట నుండే పోటీ చేయబోతున్నాని
టికెట్ నాదే గెలుపు నాదే ఇందులో ఎలాంటి అనుమానంలేదన్నారు.
ఇందులో ఎలాంటి కన్ఫ్యూషన్ లేదన్నారు.
లోకల్ నాన్ లోకల్ అని ప్రచారం కరెక్ట్ కాదని,
40 సంవత్సరాలు సూర్యాపేట కేంద్రంగా రాజకీయాల్లో ఉన్నానన్నే సంగతి పార్టీ మిత్రులు గమనించాలని హితవు పలికారు
ఎవరు పార్టీలో లేనప్పుడు నేనొక్కడినే ఇక్కడ నుండి గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేశానని,
ఇండిపెండెంట్ గా గెలిచినా ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ మారకుండా తిరిగి కాంగ్రెస్ లోకే వచ్చానని అలాంటి నిబద్ధతగల తనకు పార్టీ మారే అవసరం ఏముందని ప్రశ్నించారు
గతంలో చంద్రబాబు , టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో కేసీఆర్ పార్టీలోకి రావాలని కోరినా వెళ్ళలేదన్నారు.
ఇప్పడు కావలసింది ప్రతిపక్ష నాయకుల పార్టీ మార్పు పై దృష్టి పెట్టడం కాదని
వర్షాలతో నష్టపోయిన ప్రజలకి , రైతులకు చేయూత అందించి ఆదుకోవాలని కోరారు
నాకు ఎలాంటి గ్రూపులు లేవని, నాది కాంగ్రెస్ గ్రూపు సోనియా గ్రూపు అని పేర్కొన్నారు
పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తానని,
పార్టీ మార్పు కుట్రలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.