నల్గోండ: నల్లగొండ జిల్లా పరిధిలో కరెంటు కోతలపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నకిరేకల్, నల్లగొండ, నాగర్జునసాగర్, తిప్పర్థి సహ పలు ప్రాంతల్లో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి నకిరేకల్ మండలం, కడపర్తి గ్రామంలో రైతులు సబ్ స్టేషన్ ను ముట్టడించగా, శుక్రవారం పలు చోట్ల ధర్నాలు చేపట్టారు. వ్యవసాయ కరెంటును నాలుగు గంటలు కూడా రావడం లేదంటూ రైతుల నిరసన వ్యక్తం చేశారు. పలు చోట్ల రైతులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.