తెలంగాణలో ఇవాళ కొత్తగా 33 కరోనా కేసులు
ఇవాళ తెలంగాణలో 33 కొత్త కేసులు నమోదు కాగా, వాటిలో 26 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే గుర్తించారు. ఏడుగురు వలస కార్మికులకు కూడా కరోనా సోకినట్టు నిర్థారణ అయింది. ఇక, తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1196కి పెరిగింది. ఇవాళ ఎవరూ డిశ్చార్చి కాలేదు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనాతో 30 మంది మరణించారు.